కుమ్మపల్లిలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
పాల్గొన్న మహిళలు టీడీపీ నేతలు
వేపాడ జూన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :-
మండలంలోని కుమ్మపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గ్రామంలోని మహిళలు ఆదివారం పాలాభిషేకం జరిపారు. కేవలం మహిళలు, రైతులు, యువత భవిత కోసం మహానాడులో ప్రకటించిన మినీ మీనిఫెస్టోను పురష్కరించుకొని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్, నాయకులు లాలం అర్జునరావు, పోతల వెంకటరమణ, కొట్యాడ రమణమూర్తి,నియోజకవర్గ టిఎన్ ఎస్ ఎఫ్ నాయకుడు డెక్క ఈశ్వరరావు బోజంకి మహేష్, గోకేడ నాగభూషణం, కొటానఅప్పలనాయుడు, గ్రామంలోని టీడీపీ నాయకులు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



