ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం.
వేపాడ,జూన్,11(అఖండ భూమి ):-మండలంలోని వేపాడ శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి సోమనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం తరగతులు నేటితో ముగిసాయి.ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని గతనెల 8నుంచి ఈ నెల 11వరకు నిర్వాహంచారు. ఈ సందర్భంగా వేపాడ శాఖ గ్రంథాలయంలో విద్యార్థిని, విద్యార్థులకు, వ్యాచరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేపాడ ఎంపీటీసీ దాడి గంగతల్లి పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.



