కరెంటు ఇంజన్ మీదికి దూకి వ్యక్తికి తీవ్ర గాయాలు…
నంద్యాల జిల్లా డోన్ వెబ్ న్యూస్ : డోన్ పట్టణం నందు రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైల్వే బ్రిడ్జి నుండి కరెంటు ఇంజన్ మీదికి దూకడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒళ్లంతా ఖాళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇతను పేరు బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ అని తెలపడం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతనికి తెలుగు రాకపోవడంతో హిందీలోనే మాట్లాడుతున్నట్లు పోలీసులు విచారణలో తెలిపారు. ఇతను ఎందుకు దూకాడో అన్న విషయాలు పూర్తిగా తెలిసి రాలేదు. ఇతడు ఏ ప్రాంతానికి చెందినవారు అన్న విషయం ఎవరికైనా తెలిస్తే రైల్వే ఎస్సై నంబర్ 9441759875 ఫోన్ చేయగలరని పోలీసులు తెలిపారు.