భార్యను కాపురానికి పంపలేదని మామ పై కత్తి తో దాడి చేసిన అల్లుడు

 

భార్యను కాపురానికి పంపలేదని మామ పై కత్తి తో దాడి చేసిన అల్లుడు

కొయ్యూరు జూన్ 13 అఖండ భూమి వెబ్ న్యూస్ :

కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీ సోలాబు గ్రామానికి చెందిన పాంగి భాస్కరరావు తన కుమార్తె అయిన లక్ష్మిని సుమారు 18 సంవత్సరాలు క్రితం జీకే వీధి మండలం చినగొంది గ్రామానికి చెందిన వంతల చిట్టిబాబుకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితం తన కుమార్తె మరియు అల్లుడు కాకరపాడు గ్రామానికి వచ్చి నివాసము ఉండడం జరిగింది అయితే గత కొంతకాలంగా తన కుమార్తె అయిన లక్ష్మి ని అల్లుడు సరిగా చూసుకోకుండా శారీరకంగా వేధించడం వల్ల తన కుమార్తెను తనతోపాటు ఇంటికి తీసుకువెళ్లి చూసుకోవడం జరుగుతుంది. అయితే దీని మీద కోపం పెంచుకున్న అల్లుడు తన భార్యను కాపురం పంపకపోతే చంపేస్తానని మామని హెచ్చరించడం జరిగింది. అయితే తేదీ 11 6 2023న కాకరపాడు గ్రామంలో గల మెకానిక్ షెడ్ వద్ద పాంగి భాస్కరరావు ఉండగా అదే అదునుగా చూసి తన అల్లుడైన వంతలు చిట్టిబాబు కత్తితో తలపై నరికి చంపడానికి ప్రయత్నిస్తుండగా పాంగీ భాస్కరరావు కి తల పైన ఎడమ మోచేతి పైన గాయాలయ్యాయి ఇది చూసి ఆపడానికి ప్రయత్నిస్తున్న మర్ర శ్రీను అనే వ్యక్తికి చేతికి గాయమైనది దీని మీద ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితున్నే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం అయినది.

Akhand Bhoomi News

error: Content is protected !!