కంబాలపాడు గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి…

 

కంబాలపాడు గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి…

డోన్ (క్రిష్ణగిరి) జూన్ 14 (అఖండ భూమి) : మండల పరిధిలోని కంబాలపాడు గ్రామoలో వున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల /కాలేజీ నందు ఇదే మండలం పోతుగల్లు గ్రామ మజారా గ్రామమైన గుండ్ల మల్లాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబుకు ముగ్గురు సంతానం అందులో పెద్దకూతురు లూథియా (ప్రస్తుతం 8వ తరగతి) నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్ నందు ఈరోజు సాయంత్రం సీలింగ్ ఫ్యాన్ కు తన చున్నీతో ఉరివేసుకొని చనిపోయినది..

ఈ అమ్మాయి వేసవికాలం సెలవులు ముగించుకుని ఈరోజు సాయంత్రం 4: 52 నిమిషాలకు తన తండ్రితో పాటు స్కూల్ నందు ప్రవేశించినట్లు రిజిస్టర్లో నమోదు అయినది. సాయంత్రం 6:10 నిమిషాలకు స్కూల్ కేర్ టేకర్ అమ్ములు మరియు హెల్త్ టేకర్ కళావతి ఇద్దరూ మెస్సు నందు భోజనానికి పిలవడానికి వెతకగా అమ్మాయి కనబడలేదని ఈ సందర్భంగా క్లాస్ రూమ్ లో వెతకగా నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్లో అమ్మాయి ఉరి వేసుకున్నట్లు కనపడిందని సమాచారం.. ఈ స్కూలు ఈనెల 12వ తేదీ తెరవబడినది.. ప్రస్తుతానికి 72 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈరోజు అమ్మాయి సాయంత్రం వచ్చిన గంటకే ఉరి వేసుకొని చనిపోయినది… మరణానికి కారణాలు క్రిష్ణగిరి పోలీసులు విచారిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!