బాలల భవితకు భాగస్వామ్యమే…భాగీదారి కార్యక్రమం

 

బాలల భవితకు భాగస్వామ్యమే…భాగీదారి కార్యక్రమం

వెల్దుర్తి జూన్ 14 (అఖండ భూమి) : బాలల భవితకు భాగస్వామ్యమే…భాగీదారి కార్యక్రమం అని అంగనవాడి టీచర్స్ అన్నారు. ఈ సందర్భంగా వెల్దుర్తి పట్టణంలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు కలిసి జన భాగీదారి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని

పురవీధుల్లో ర్యాలీ చేశారు. చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు. బాలల భవితకు భాగస్వామ్యమే అంగన్వాడి టీచర్లు అన్నారు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రీస్కూల్లో

చేర్పించడానికి తల్లితండ్రులు బాధ్యత వహించాలన్నారు. 5 సంవత్సరాలు పూర్తయిన వారిని ఎలిమెంటరీ పాఠశాలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంతో పిల్లలు బడికి వస్తే వారికి పోషకాహారాలు

అందించబడతాయన్నారు. కోడిగ్రుడ్లు, ఆహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ విద్య-ఆటపాటల విద్య అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో

నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు విజయకుమారి, ఈదమ్మ, సరస్వతి, వరలక్ష్మి, రామలక్ష్మి, హెబ్సిబా, మహాబూబీబీ, జ్యోతి, సుజాత,

షమీన, రేణుక, షబాన, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!