దేశం మారాల్సిన సమయం వచ్చేసింది : సీఎం కేసీఆర్

 

CM KCR | దేశం మారాల్సిన సమయం వచ్చేసింది : సీఎం కేసీఆర్

నాగ్‌పూర్ : దేశం మారాల్సిన సమయం వచ్చేసింది.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు..

దేశం మారాల్సిన సమయం వచ్చేసింది.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తొంది..? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విషయం ఆలోచిస్తే నాకు భయమేస్తోంది. జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశాం. దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికలోనూ నేతలు కాదు.. జనాలు గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది. జనం చంద్రుడు, నక్షత్రాలు కోరడం లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!