అరకులో పలు గ్రామాల్లో పర్యటించిన వైసీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి.

వైసీపీ ప్రభుత్వం పనితీరు పై గిరిజనులు జేజేలు కొడుతున్నారు వైస్సార్సీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రేగం మత్యలింగం.
అల్లూరి జిల్లా, అరకువాలీ, అఖండ భూమి వెబ్ న్యూస్ :
అరకువాలీ మండలంలో గల బస్కి, బౌన్స్గూగూడ,గొందిగుడ, దేవరపల్లి గ్రామాలను రాష్ట్ర వైస్సార్సీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ,హుకుంపేట, జెడ్పీటీసీ రేగం మత్స్య లింగం సందర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా అయన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోని,ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పై చర్చంచటం జరిగింది.గత ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకురలేదని,ప్రస్తుత జగనన్న పాలనలో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని గ్రామాల్లో ప్రజలు తెలియజేశారు.ఈ రోజు రైతులకు రైతు భరోసా,విద్యార్థులకు అమ్మఒడి, ఆర్దికంగా వెనుక బాటు చెందిన మహిళలకు చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలు ఎంతో ప్రయోజనం చేకూరు స్తుందని అన్నారు. రానున్న కాలంలో మళ్ళీ జగన్ నే సీఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తబల్లుగుడ ఎంపీటీసీ శ్వాభి రామూర్తి, మాదల ఎంపీటీసీ స్వాభి రామచందూర్, స్థానిక వార్డు మెంబర్, కిళ్లో అప్పారావు, గ్రామస్తులు పాల్గోన్నారు.


