బొర్రాగుహ లో పెరిగిన పర్యాటకుల తాకిడి.

ఆదివారం ఒక రోజే లక్ష 60,000 వరకు ఆదాయం.
అల్లూరి జిల్లా, అనంతగిరి(అఖండ భూమి) జూన్ 18: మండలములో ప్రథమ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలో ఆదివారం నాడు, పర్యాటకుల తాకిడి కిటకిట లాడింది. వేసవి సెలవులు పూర్తికావస్తున్న కొంత మేరకు తాకిడి పెరిగింది. గత ఆదివారంతో పోలిస్తే కొంతమేరకు జనాలు తగ్గిన బాగానే పర్యాటకులు తిలకించేందుకు వచ్చారని, ఆదివారం ఒక్కరోజే ఒక లక్ష 60,000 వరకు ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ వెల్లడించారు.


