ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య ను తీర్చేందుకు రూ 12.5 లక్షలతో పైప్ లైన్ నిర్మాణ పనులు
ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు రుణపడి ఉంటామంటున్న ఎస్సీలు
తుగ్గలి జూన్ 18( ప్రభ న్యూస్)
మండలం పరిధిలోని చెన్నంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు రూ 12.5 లక్షలతో పైప్ లైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మా ఎస్సీ కాలనీలో పర్యటించినప్పుడు పలువురు ఎస్సీలు తమ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తక్షణమే ఆ కాలనీలో ఎస్సీలకు మంచినీటి సమస్య పరిష్కరించేందుకు పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ 12.5 లక్షల మంజూరు చేయించారు. ఈ పనులను స్థానిక వైసిపి నాయకులు రంజాన్, సుభాన్, పులి లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చేతుల మీదుగా ఎస్సీ కాలనీకు మంచినీరు సరఫరా చేస్తామన్నారు. కాలనీకి చెందిన పలువురు ఎస్సీలు మాట్లాడుతూ తమ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ఎమ్మెల్యే శ్రీదేవమ్మా నిధులు మంజూరు చేయించడం పట్ల తాము ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు రుణపడి ఉంటామని తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



