రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు- ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్
రాజవొమ్మంగి, అఖండ భూమి జూన్ 18 రాజవొమ్మంగి మండలంలో వాహనదారులు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.మండల కేంద్రమైన రాజవొమ్మంగి లో ఆదివారం సాయంత్రంపోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ వాహనరికార్డులను పరిశీలించారు. కారు డిక్కేలు తనిఖీ చేశారు. గంజాయి సారాయి, మారక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారించడంలో భాగంగా పోలీసులుతనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వచ్చి పోయే వాహనాలను నిశితంగా పరిశీలించారు. వాహనదారులు రికార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, వాహన చట్టం నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్, పి సి రమణ, ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…



