రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు- ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్
రాజవొమ్మంగి, అఖండ భూమి జూన్ 18 రాజవొమ్మంగి మండలంలో వాహనదారులు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.మండల కేంద్రమైన రాజవొమ్మంగి లో ఆదివారం సాయంత్రంపోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్ వాహనరికార్డులను పరిశీలించారు. కారు డిక్కేలు తనిఖీ చేశారు. గంజాయి సారాయి, మారక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారించడంలో భాగంగా పోలీసులుతనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వచ్చి పోయే వాహనాలను నిశితంగా పరిశీలించారు. వాహనదారులు రికార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, వాహన చట్టం నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై గోపి నరేంద్ర ప్రసాద్, పి సి రమణ, ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



