రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…

 

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

… సింగిరెడ్డి రామకృష్ణ.

రాజవొమ్మంగి,అఖండ భూమి జూన్ 21

అల్లూరి జిల్లా,

రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి మండలం. రాజవొమ్మంగి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజవొమ్మంగి వైఎస్ఆర్సిపి మండల ప్రెసిడెంట్ సింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము.వెంకటలక్ష్మి మాట్లాడుతూ…. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై అందజేస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి రైతు అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయలేనంత సహాయం మన జగనన్న ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల ప్రెసిడెంట్, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము.వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ సప్పా.సత్య చంద్రరాణి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!