జగన్ మోహన్ రెడ్డి వలనే విద్యావిధానంలో సమిష్ట మార్పు
బిక్కవోలు. అఖండ భూమి వెబ్ న్యూస్ :
తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్దులుకు వైసిపి పంచాయతీ రాజ్ కార్యదర్శి పోతుల ప్రసాద్ రెడ్డి శుక్రవారం స్కూల్ బ్యాగులు,పుస్తకాలు,యానిఫాం పంపిణీ చేసారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో విద్యావిధానం సమిష్టిగా మారిపోయిందని,విద్యార్దులుకు అవసరమైన ప్రతి ఒక్కటి ప్రభుత్వమే సమకూర్చడం విధానంగా చాలా గొప్పవిషయం అని అన్నారు.విద్యార్దుల తల్లిదండ్రులు తమ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు.
ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాయిడు శివ,వైసిపి నాయకులు పెంకే సత్తిబాబు,విద్యార్దుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



