మిల్లుల దగ్గర నగదు చెల్లించిన రైతుల వివరాల సేకరణ
బిక్కవోలు. అఖండ భూమి వెబ్ న్యూస్ :
తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యర్వంలో
రబీ పంటలో ఉభయ గోదావరి జిల్లాలో రైస్ మిల్లులకు నగదు చెల్లించిన రైతులకు డబ్బును తిరిగి ఇవ్వాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ పంట మునిగింది – పరిహారం ఇవ్వండి అనే కార్యక్రమం ద్వారా రైస్ మిల్లులకు నూక శాతం, తేమ శాతం పేరుతో నగదు చెల్లించిన రైతుల వివరాలు సేకరించారు.తక్షణమే ప్రభుత్వం ఆ నగదును రైతులుకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చెసారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరీయు ఊలపల్లి గ్రామ నాయకులు,రైతులు పాల్గొన్నారు.



