ఈనెల 26న మనబడి నాడు నేడు పై సమావేశం
ఎంపీడీవో లాలం సీతయ్య
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
జూన్ 23 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నెల 26న మండల పరిషత్తు కార్యాలయంలోని సమావేశ మందిరంలో మనబడి నాడు నేడు , జగనన్న విద్యా కానుకపై సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో లాలం సీతయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం అతి ముఖ్యమైనది కావున మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అలా హాజరు కాని వారి వివరాలను జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేశారు



