సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి!

 

Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి!

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి..

ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. రియాక్టర్‌ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.

మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!