అభిషేకం నిర్వహించేందుకు వెండి పరికరాలు బహుకరణ.. వెల్దుర్తి జులై 03 అఖండ భూమి వెబ్ న్యూస్ :
స్థానిక జర్నలిస్టు కాలనీలోని సద్గురు సాయినాథ స్వామికి భక్తులు సోమవారం గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబాకి వెండి విగ్రహం, ఆలయంలో కొలువైన స్వామి వారులకు అభిషేకం నిర్వహించేందుకు వెండి జల్లెడ, సాయినాధుడి కాళికి వెండి కడియం చేయించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి వస్త్రాలు అందించి ఆభరణాలను అందించారు. వెండి వస్తువులను చేయించిన దాతలు బృంగేశ్వర గోత్రం,. మహేష్ శాస్త్రి శ్యామలాదేవి దంపతుల కుమార్తెలు నిర్విజ్ఞ, త్రివిద్య ఆభరణాలను చేయించి స్వామివారి భక్తికి పాత్రులయ్యారు.



