అనూహ్య మలుపు- విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!!
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది..
ఈ నోటీసులకు సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సమాధానాలను ఇవ్వాలని ఆదేశించింది. సాయిరెడ్డితో పాటు జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ యాజమాన్యానికీ ఈ నోటీసులను ఇచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు సాగిస్తోన్న విషయం తెలిసిందే. సీబీఐ కేసుల విచారణ కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఎలాంటి విచారణ జరపకూడదంటూ ఇదివరకు తెలంగాణ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ఆదేశించింది.
2021లో తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, విజయసాయిరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు..
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…



