అధికార వైసిపి పార్టీని జనసేన వారాహి బస్సు చక్రాల కింద తొక్కుతాం..
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో చోడిశెట్టి గణేష్.
కోటనందూరు (అఖండ భూమి):
అధికార వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో జనసేన వారాహి బస్సు చక్రాల కింద వేసి తొక్కుతామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్ అన్నారు. కాకినాడ జిల్లా, కోటనందూరు మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ పెదపాత్రుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ రెండు బలమైన పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కొండలు గా ఉన్నాయని నివురు కప్పిన నిప్పుల జనసేన కార్యకర్తలు ఉరకలేసిన ఉత్సాహంతో పని చేస్తామని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంతం చూస్తామని అన్నారు. అంకారెడ్డి రాజశేషు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కోటనందూరులో మండల స్థాయి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, జనసేన పార్టీ చాపక్రింద నీరు లా ప్రజల హృదయాల్లో చొచ్చుకొని పోతుందని, అధికార వైసిపి పార్టీ బెదిరింపులకు భయపడి ముందుకు రాలేకపోతున్నారని అన్నారు. వారాహి యాత్రతో ప్రజలు నాయకులు జనసేన వైపు చూస్తున్నారని 2024 లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నక్కా రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లు లవరాజు, వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు, పెద్ద సంఖ్యలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”