ఘోర బస్సు ప్రమాదం.. పెళ్లింట విషాదం.. ఏడుగురు మృతి

 

Road Accident : ఘోర బస్సు ప్రమాదం.. పెళ్లింట విషాదం.. ఏడుగురు మృతి

ప్రకాశం జిల్లా దర్శిలో.. అర్థరాత్రి బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో.. ఏడుగురు చనిపోయారు..

మరో 30 మంది గాయపడ్డారు. వారంతా పొదిలికి చెందిన వారని తెలిసింది.

పెళ్లి బృందం వారు పొదిలి నుంచి.. అద్దెకు తీసుకున్న ఆర్టీసీ బస్సులో కాకినాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

బస్సు చాలా వేగంగా కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!