ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష..
గుంటూరు: రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ సమీక్ష చేపట్టనున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గనులు, ఎక్సైజ్ ఈ జాబితాలో ఉన్నాయి..
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు, ఆయా విభాగాల అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది..



