మురళి వాని పాలెం లో 30 మంది రైతులకు శిక్షణ

 

మురళి వాని పాలెం లో 30 మంది రైతులకు శిక్షణ

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాజవొమ్మంగి మండలం మురళి వాని పాలెం లో గ్రామంలో డాక్టర్ వైయస్సార్ పొలంబడి కార్యక్రమం

రాజవొమ్మంగి మండల వ్యవసాయ అధికారి డాక్టర్ రమేష్ నాయుడు ప్రారంభించడం జరిగింది

ఈ పొలంబడి కార్యక్రమంలో 30 మంది రైతులతో నిర్వహించడం జరుగుతుంది అని వీరందరికీ ఈ కార్యక్రమంలో ప్రారంభించినప్పటి నుండి వారానికి ఒక రోజు చొప్పున 14 వారాలు పాటు ఈ శిక్షణ కార్యక్రమం పై అవగాహన కల్పించడం జరుగుతుంది అని ఎంచుకున్న పంటపై పకృతి మరియు రసాయన పద్ధతులు పై సమగ్ర యాజమాన్య విధి విధానాలపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని ఏవో చెప్పడం జరిగింది

డాక్టర్ వైయస్సార్ పొలంబడి కార్యక్రమం ద్వారా రైతు వ్యవసాయం లో తను చేసే పనులకు తనంతట తానే స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దడమే దీని ముఖ్య లక్ష్యం అని ఈ సందర్భంగా రైతులతో జరిగిన కార్యక్రమంలో ఏవో చెప్పడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!