కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వైసిపి నాయకులు మట్టిని అక్రమంగా తరలించడంపై ఆ గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలోని చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని అదేవిధంగా తాండవ నదిలోని ఇసుకను సైతం అక్రమంగా తరలిస్తూ కాసులు వెనకేసుకుంటున్నారని ఆయన అన్నారు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని బుల్లిబాబు అన్నారు ఇలాంటి దుశ్చర్యలతో గ్రామ ప్రజలందరూ విసిగిపోయారని ఆయన అన్నారు అంతేకాకుండా జగనన్న కాలనీల స్థలాల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగినా రెవెన్యూఅధికారులు కనీసం అటువైపుచూడకపోవడం పలుఅనుమానాలకు తావిస్తుందన్నారు అర్హులకి స్థలాలు కేటాయించకుండా అనర్హులకు ఒక్కొక్కరికి నాలుగు సెంట్లు చొప్పున అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు దీనిపై రెవెన్యూ అధికారులు పూర్తి విచారణజరపాలని ఆయన అధికారులనుకోరారు లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆయన అన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


