మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

 

మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

మంప ఎస్సై లోకేష్ కుమార్

కొయ్యూరు అఖండ భూమి జూలై 30 అల్లూరి జిల్లా

సిపిణ మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలంలో బూధ రాళ్ల పంచాయతీ వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని మంప ఎస్సై లోకేష్ కుమార్ అన్నారు వాహనాలు తనిఖీల్లో భాగంగా అనుమానత వ్యక్తులను ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు సంతల నుంచి ఎవరైనా అనుమానత సామాగ్రి తీసుకు వెళుతున్నారా అని తనిఖీలు చేయడం జరిగిందన్నారు బాలరేవుల కునుకూరు పోకల పాలెం గోధుమ లంక కన్నవరం నల్లబెల్లి బొడ్డు మామిడి తదితర గ్రామస్తులతో ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అనుమానిత అపరిచిత వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని వారికి తెలియజేశారు అలాగే ఎవరు కూడా మావోయిస్టు కార్యక్రమాలకు సహకరించవద్దని ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులకు తెలియజేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!