వరదబాధితులకు భోజనాల ఏర్పాట్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన మండలం అఖండ భూమి
వరద ప్రభావితం అయిన పల్లిపాలెం, పల్లంకుర్రు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వి.వి.వి.సత్యనారాయణ పర్యవేక్షణలో రుచికరమైన వంటకాలు అందించారు.తహసీల్దార్ స్వయంగా వాటిని రుచి చూసారు.ఇదే విధంగా వంటలు చేసి బాధితులకు అందించాలని క్రింద స్థాయి సిబ్బందిని ఆదేశించారు.



