వరద బాధితులని ఆదుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను కోరిన ఎమ్మెల్యే సీతక్క.
తాడ్వాయి ప్రతినిధి ,అఖండ భూమి న్యూస్ ,జూలై 30.
తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామములో మంత్రి సత్యవతి రాథోడ్ ని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ని కలిసి గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు నష్ట పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజక వర్గం లో ప్రాణ నష్టం తో పాటు అస్తి నష్టం వాటిల్లింది అనేక గ్రామాలు వరుదల్లో చిక్కుకొని తినడానికి తిండి లేక తాగటానికి మంచినీళ్ళు లేక అలమటిస్తున్న పరిస్థితి ఉందని వరుద ల వదృతి వలన ఇంట్లో ఉన్న వస్తువులు, కార్లు,ట్రాక్టర్లు వంట సామాగ్రి,వ్యాపారస్తుల దుకాణాలు వరుదల్లో కొట్టుకుపోయి సర్వసం కోల్పోయారు. ఏటూరు నాగారం మండలం లోని కొండాయి, వేంకటా పూర్ మండలం లోని బురగు పేట లాంటి గ్రామాల్లో ప్రాణ నష్టం వాటిల్లింది, రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకోవాలి వారికి నష్ట పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా వరదల్లో
కొట్టుకుపోయి మరణించిన కుటుంబాలకు ఒక్కరికీ 5 లక్షల చొప్పున నష్ట పరిహారం తో పాటు వారికి డబుల్ బెడ్ మంజూరు చేయాలని సీతక్క అన్నారు.
జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య ఐఎఎస్,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ కి ఫోన్ చేసి ముంపుకు గురైన గ్రామములలో పారిశుధ్య పనులు చేపట్టి బాధిత కుటుంబాలకు బోజన సౌకర్యం కల్పించాలని పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాలని గ్రామాల్లో అధికారులు పర్యటించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.



