గుంటు పల్లెలో దాహం…! దాహం…!!
పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు…
ఇబ్బందుల్లో గ్రామ ప్రజలు…
వెల్దుర్తి ఆగస్టు 13 అఖండ భూమి వెబ్ న్యూస్ :
సూదేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మజర గ్రామం గుంటుపల్లి గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న వైనం ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. గత వారం రోజుల నుండి నీరు లేక సుదూర ప్రాంతం నుండి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదు. సుదూర ప్రాంతాల నుండి నీటిని తీసుకొని వచ్చి అవసరాలు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. అయితే గ్రామపంచాయతీ నందు నిధులు లేకపోవడంతో మోటర్ మరమ్మత్తులు చేయించుకోవడానికి కూడా విధులు లేక పంచాయతీ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. పాలకులు మాత్రం గ్రామం వైపు తొంగి చూడకుండా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గ్రామపంచాయతీ అధికారులు మోటార్ మరమ్మత్తులు చేయించి మా గ్రామ కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”