గుంటు పల్లెలో దాహం…! దాహం…!!
పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు…
ఇబ్బందుల్లో గ్రామ ప్రజలు…
వెల్దుర్తి ఆగస్టు 13 అఖండ భూమి వెబ్ న్యూస్ :
సూదేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మజర గ్రామం గుంటుపల్లి గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న వైనం ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. గత వారం రోజుల నుండి నీరు లేక సుదూర ప్రాంతం నుండి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదు. సుదూర ప్రాంతాల నుండి నీటిని తీసుకొని వచ్చి అవసరాలు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. అయితే గ్రామపంచాయతీ నందు నిధులు లేకపోవడంతో మోటర్ మరమ్మత్తులు చేయించుకోవడానికి కూడా విధులు లేక పంచాయతీ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. పాలకులు మాత్రం గ్రామం వైపు తొంగి చూడకుండా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గ్రామపంచాయతీ అధికారులు మోటార్ మరమ్మత్తులు చేయించి మా గ్రామ కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..