నాతవరం మండలం గునుపూడి లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మలేరియా టైఫాయిడ్ వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సబ్బవరపు దేవుడు అన్నారు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయడం లేదని డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వలన దోమలు అధికంగా వృద్ధి చెంది వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయని ఆయన అన్నారు అంతేకాకుండా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను బోధనకు సంసిద్ధులను చేయటకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించకుండా తరగతుల నిర్వహణ సమయంలో నెలల తరబడి నిర్మాణాలను చేపట్టడంతో అనవసరమైన శబ్దాలు ఉద్భవించడం కారణంగా విద్యార్థుల ఏకాగ్రత లోపించి ఉపాధ్యాయులు బోధించినది విద్యార్ధులకు అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు అంతేకాకుండా పాఠశాలలో తరగతి గదుల దగ్గరలో మురికి నీరు నిల్వ అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమల వృద్ధి అధికమై తరగతి గదుల్లో విద్యార్థులు దోమ కాటుకు గురై వ్యాధులు బారిన పడుతున్నారని ఆయన అన్నారు ఇదిలా ఉండగా పాఠశాల రక్షణ గోడ కూలి గేట్లు ధ్వంసం అయ్యాయని గడ్డి విపరీతంగా పెరిగి విష సర్పాలు సంచరిస్తున్నాయని ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్