కోదాడకే తలమానికం ఎర్రవరం గ్రామం
దూలగుట్టపై స్వయంభుగా వెలిసిన బాల ఉగ్ర నరసింహ స్వామి
అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.
తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మారిన ఎర్రవరం గ్రామం ఎర్రవరం దూలగుట్టపై స్వయంభుగా వెలిసిన బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ దేవాలయానికి దాతల సహకారం ఎంతో అవసరం అని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. ఆదివారం మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి తండ, కూచిపూడి గణపవరం ఎర్రవరం రామలక్ష్మి పురం బిక్య తండ గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్. అనంతరం ఎర్రవరంలో స్వయంభుగా వెలసిన బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల నుంచి ఎర్రవరం గ్రామానికి పోటెత్తుతున్న భక్తులు ఈ దేవాలయ కమిటీ సభ్యులు సహకారంతో వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు కానీ వారి వల్ల కావడం లేదు కావున ఆ దేవాలయానికి దాతలు సహకారం ఎంతో అవసరం ఉందని అన్నారు. ఇక్కడకు వస్తున్న భక్తులకు ఉండటానికి సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కావున భక్తులకు తక్షణ అవసరాలు కు సంబంధించిన వాటిని ఏర్పాటు చేయాలి భక్తులకు ఉండటానికి షెడ్లు మహిళలకు వికలాంగులకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించాలి గుట్ట పైకి ఎక్కటానికి సరైన రోడ్డు లేక భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సౌకర్యాలు అన్ని మంచిగా ఏర్పాటు చేయాలని అన్నారు.భక్తులకు ఇబ్బంది కలగకుండా వెడల్పు రోడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,వీరయ్య,వెంకటేశ్వర్లు,పుల్లారావు,నాగేశ్వరరావు మధుబాబు,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,జానకి రాములు, శంకర్,నవీన్,కతిమాల వెంకన్న,చంద్రకళ,గౌతమి,కళావతి మాలోవత్ బాలు,అయ్యప్ప, అప్పారావు,ఎలుగూరి సైదులు గౌడ్ బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


