AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏలు విడుదల

AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏలు విడుదల

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు డీఏ.. G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేసింది. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది. కాగా జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను.. సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఈ కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం కానుంది. డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు..

Akhand Bhoomi News

error: Content is protected !!