మహిళా పోలీసుల మధ్య ఉన్న అజ్ఞాతవాసి ఎవరు… ?
ఆ అజ్ఞాతవాసిని పోలీసులే ఆహ్వానించారా…? లేక ప్రత్యక్షమయ్యాడా…
జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా స్టేటస్ ఫోటోలు చక్కెరలు కొడుతున్న వైనం..
ఆజ్ఞాతివాసి విషయం పోలీసులకు తెలిసిన ఎక్కడ జరుగుతోంది ఈ తప్పిదం…
పోలీసు ఉన్నతాధికారులకు చేరిన ఇతని వ్యవహార శైలి…
అతనిపై చర్యలు తీసుకుంటారా…లేదా.. పోలీసులే తేల్చాలి..
వెల్దుర్తి ఆగస్టు 15 అఖండ భూమి వెబ్ న్యూస్ :
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సాక్షిగా తప్పిదాలు జరుగుతున్న పోలీసు బాసులు ఎందుకు మిన్నకుండి పోతున్నారు. ఆ వ్యక్తి అంటే పోలీసులకు భయం ఎందుకు.. ? ఈ అజ్ఞాతవాసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సాక్షిగా బాధ్యత గల మహిళా పోలీసుల మధ్య జండా వందనానికి పోలీస్ బాసులే ఆహ్వానించారా .. ? ఎవరు ఆ అజ్ఞాతవాసి.. ఎందుకు ఈ తపిదాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ ను వేదికగా చేసుకొని స్టిల్స్ ఫోటోలు, స్టేటస్ లో పెట్టుకొని జిల్లా అంత వైరల్ అవుతున్న ఘటన మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాక్షిగా బట్టబయలు అయ్యాయి. దీంతో వెల్దుర్తి పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అజ్ఞాతవాసిని పోలీస్ స్టేషన్కు పోలీసులే ఆహ్వానించారా అన్న కోణంలో వెల్దుర్తి పట్టణ, మండల ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ అజ్ఞాతవాసి రాజకీయ నాయకుడు కాదు, రెవెన్యూ అధికారి అంతకంటే కాదు, అర్హత లేని మనిషితో ఈ మహిళా పోలీసుల మధ్య ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అన్న కోణంలో పలు విషయాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ అజ్ఞాతవాసి ఫోజులిచ్చి ఫోటోలు దిగితే హోంగార్డు ఫోటోలు తీసి ఇవ్వడం పోలీసుకు తీరని మచ్చగా ఏర్పడింది. పోలీసు వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని చలామణి కావాలనే ముఖ్య ఉద్దేశంతో చట్ట వ్యతిరేకత పనులకు పాల్పడే అవకాశం ఉందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు మహిళా పోలీసులపై, అజ్ఞాతవాసి పై చర్యలు తీసుకుంటారా… ? లేదా అన్న కోణం ఉత్కంఠ భరితంగా మారిందని ప్రజలు తెలుపుతున్నారు. వారిపై చర్యలు తీసుకొని న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”