మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..

 

 

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి. (అఖండ భూమి) ఆగస్టు 15. కల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ లావణ్య మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భర్త ప్రసాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై రెండుసార్లు హత్యాయత్నం చేశాడని ఆరోపణలపై కేసులు ఉన్నాయి. దీంతోపాటు సర్పంచ్ లావణ్యను సస్పెండ్ చేయడం నిధులు విడుదల కాకపోవడం అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ముస్తాపం చెంది సర్పంచ్ లావణ్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్యను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. లావణ్య కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుందని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సర్పంచ్ భర్త పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం వల్లే మహిళ సర్పంచ్ లావణ్య ఆత్మహత్యాయత్నం పాల్పడిందని ఆయన ఆరోపించారు. పరామర్శించిన వారిలో అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు. మండల అధ్యక్షుడు గిరీష్.మాక్లుర్ మండల అధ్యక్షుడు సురేష్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!