సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులు

 

 

మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టారు..

 

అఖండ భూమి వెబ్ న్యూస్ :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సర్వే సమావేశానికి అధికారులు డుమ్మ కొట్టారు. సర్వసభ్య సమావేశంలో అధికారులు వచ్చి రాక సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దాదాపు 11 గంటలైనా కూడా సమావేశానికి హాజరు కవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. మండల సర్వసభ్య సమావేశ భవనం నందు కాలి కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలు పరిష్కార మార్గం అధికారుల పనితీరు గురించి చర్చించాల్సిన ప్రజాప్రతినిధులే హాజరు కాకపోవడం అభ్యంతరం ఏమిటో అధికారులే తేల్చాల్సి ఉంది. ఈ సమావేశం నందు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి హాజరై వారి సమస్యలను విన్నవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఉన్నత అధికారుల ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Akhand Bhoomi News

error: Content is protected !!