నిత్యవసర సరుకుల పంపిణీ
చండ్రుగొండ 1సెప్టెంబర్ (అఖండభూమి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామపంచాయతీలో గల మహమ్మద్ నగర్ గ్రామంలో విష జ్వరాల బారిన పడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు సహకారం,ఆదేశాల మేరకు మండల బిఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 కుటుంబాలకు నిత్యవసర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధారా వెంకటేశ్వరావు,జిల్లా కోఆప్షన్ రసూల్,ఎంపిటిసి విజయలక్ష్మి,సొసైటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, జిల్లా నాయకులు మెడ మోహన్ రావు,ఉన్నం నాగరాజు,సూరా వెంకటేశ్వర్లు,భూపతి రమేష్,మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరావు,చిన్న పిచ్చయ్య,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గాదే లింగయ్య,మండల నాయకులు గుగులోతు రమేష్,గడ్డం శ్రీను,బడికల శ్రవణ్ కుమార్,కళ్లెం వెంకటేశ్వర్లు,బాద్షా గఫార్మియ,అంచ కృష్ణ సుంకర రామారావు,కే లోతు శ్రీనివాస్ నాయక్ మంద అనిల్ తలారి నాగరాజు ఆలకుంట పుల్లయ్య తంబళ్ల మంగయ్య బానోత్ బీ లు నాయక్ కిక్కర్ల వెంకన్న నూతలపాటి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.



