పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం..
ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో.. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు అవకాశాలను కోవింద్ కమిటీ పరిశీలించనుంది.



