కోటనందూరు మండలం, భీమ వరపు కోట గ్రామం లో 12 కుటుంబాలకు మహిళలు వారి కుటుంబాల తో కలిసి వై సి పి ని వీడి జనసేన పార్టీ లో చేరారు వారిని తుని నియోజకవర్గం జనసేన నాయకులు అంకంరెడ్డి రాజా శేషు కండువాలు కప్పి పార్టీ లో కి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సేన పార్టీ సిద్దాంతాలు ఆశయాల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని రానున్న రోజుల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని, ఎక్కడ దారుణాలు, దౌర్జన్యాలు జరిగితే అక్కడ ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అన్నారు ఈ అరాచక వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య బద్దమైన పాలన అవసరమని రాజశేషు అన్నారు ఈ కార్యక్రమంలో, మండల జనసేన నాయకులు నక్కారామ కృష్ణ ,అల్లు రాజు బాబు, సురేష్, అభిషేక్ తదితరుల పాల్గొన్నారు.