జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
విజయవాడ: విజయవాడ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది..
ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీ వీసీకి మెమొరాండం ఇవ్వటానికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పార్డీ నాయకులను యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ మెమొరాండం ఇవ్వడానికి వచ్చిన తమపై పోలీసు ఆంక్షలు ఏంటంటూ రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి బస్సులో పడేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు ఇది నిదర్శనమని, బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నిర్బంధాలు కొత్తేమీ కాదని రుద్రరాజు తెలిపారు. రెచ్చగొట్టడం మానుకోవాలని పోలీసులకు ఆయన హితవు పలికారు. ఆందోళన తర్వాత కాంగ్రెస్ నాయకులు వీసీకి వినతిపత్రం సమర్పించారు..
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



