9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు..
దిల్లీ: భారతీయ రైల్వేలో (Indian Railways) మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందేభారత్ (Vande Bharat) రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 25 రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో తొమ్మిది రైళ్లు అందుబాటులోకి వచ్చాయి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీటిని వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో కాచిగూడ- యశ్వంత్పూర్ (KACHEGUDA- YESVANTPUR JN), విజయవాడ-చెన్నై (VIJAYAWADA-CHENNAI) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి..