రాజవమ్మంగి మండలంలో పి హెచ్ సి పై ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు తో సమీక్షా సమావేశం

 

 

రాజవమ్మంగి మండలంలో పి హెచ్ సి పై ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు తో సమీక్షా సమావేశం

రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 28 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలంలోని రాజవమ్మంగి, జడ్డంగి,లాగరాయి పి హెచ్ సి లకు సంబంధించి సెప్టెంబర్ 27 బుధవారం రాజవమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపిపి గోము వెంకటలక్ష్మి అధ్యక్షతన డాక్టర్ జి.రవీంద్ర,డాక్టర్ ఎస్ సుజి,డాక్టర్ కె.ఉషశ్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ మూడు పి హెచ్ సి ల ప్రగతిపై సమీక్షలో చర్చించడం జరిగిందని తెలిపారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు,అభివృద్ధి సేవలు అందేలా మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వడుగుల జ్యోతి, తాహశీల్దార్ వై సుబ్రహ్మణ్యాచారులు, ఎంపిడిఓ యాదగిరీశ్వరరావు జడ్డంగి సర్పంచ్ కొంగర మురళికృష్ణ,లాగరాయి సర్పంచ్ గణలక్ష్మీ,లబ్బర్తి సర్పంచ్,తంటికొండ సర్పంచ్ శుభలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!