కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం లో తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకొస్తానని అల్లి పూడి నుంచి నియోజకవర్గo లోనే అత్యధిక మెజారిటీ తో తెలుగు దేశం పార్టీని గెలిపించే దిశ గా చర్యలు తీసుకుంటామని ఆ గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు అంకం రెడ్డి బుల్లి బాబు అన్నారు కాగా అల్లిపూడి గ్రామం చాలా ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ కంచు కోటగా ఉందని కొన్ని పరిస్థితుల దృష్ట్యా వైసీపీ ఓటర్లను మభ్య పెట్టడంతో కాస్త తగ్గు ముఖం పట్టిందని మరలా పూర్వ వైభవం తీసుకొస్తామని యనమల కంచు కోట లా మారుస్తామని ఆయన అన్నారు రాష్ట్రం లోనే కాకుండా గ్రామస్థాయి లో కూడా వైసీపీ నాయకుల అక్రమ కేసులు, దందాలు, కబ్జాలు , వేధింపులు ,అవినీతి ఆగడాలు పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు పార్టీ కి వెన్నెముక లాంటి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన అన్నారు తప్పుడు కేసులతో ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నియంతలా వ్యవహరిస్తున్నారని ఇది దేశానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!

