కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం లో తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకొస్తానని అల్లి పూడి నుంచి నియోజకవర్గo లోనే అత్యధిక మెజారిటీ తో తెలుగు దేశం పార్టీని గెలిపించే దిశ గా చర్యలు తీసుకుంటామని ఆ గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు అంకం రెడ్డి బుల్లి బాబు అన్నారు కాగా అల్లిపూడి గ్రామం చాలా ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ కంచు కోటగా ఉందని కొన్ని పరిస్థితుల దృష్ట్యా వైసీపీ ఓటర్లను మభ్య పెట్టడంతో కాస్త తగ్గు ముఖం పట్టిందని మరలా పూర్వ వైభవం తీసుకొస్తామని యనమల కంచు కోట లా మారుస్తామని ఆయన అన్నారు రాష్ట్రం లోనే కాకుండా గ్రామస్థాయి లో కూడా వైసీపీ నాయకుల అక్రమ కేసులు, దందాలు, కబ్జాలు , వేధింపులు ,అవినీతి ఆగడాలు పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు పార్టీ కి వెన్నెముక లాంటి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన అన్నారు తప్పుడు కేసులతో ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నియంతలా వ్యవహరిస్తున్నారని ఇది దేశానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్

