దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక వాడలో రాజకీయ
పార్టీలన్నీ సీట్లు కార్మికులకు ఇచ్చి తీరాల్సిందే !
దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసిన
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక వాడలో కార్మికులకే సీట్లు ఇవ్వాలని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కార్మిక నాయకుడు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు గారు డిమాండ్ చేశారు
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కార్మికులకు రాజకీయపరమైన వాటా గాని సరైన ప్రాధాన్యం గాని ఇవ్వలేదని మా సమస్యలు మా హక్కుల కోసం మేమే పోరాడుతామని చట్టసభల్లో మాకు ప్రాధాన్యం ఉన్నప్పుడే మా సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి దేశంలో ఉన్న అన్ని పారిశ్రామికవాడిలో కార్మికులకు సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని కరాకండిగా తెగించి చెప్పారు కార్మికులు రాజకీయ పార్టీలు చుట్టూ తిరిగే కాలం పోయిందని కార్మిక ఓట్లు కార్మికులకు వేసుకొని కార్మిక అభ్యర్థిని గెలిపించుకొని చట్టసభల్లో ప్రాథమిక పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు కార్మికులకు రాజకీయపరమైన వాటా ఇవ్వడం న్యాయమైన డిమాండ్ అని అది ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పటికై అవి సాధిస్తామని పూర్తి విశ్వాసం నమ్మకం ఉందని ఆడారి నాగరాజు గారు తెలియజేశారు .
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



