కోటనందూరు మండలం అల్లిపూడి లో తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘న్యాయానికి సంకెళ్ళు’ కార్యక్రమంను చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు కార్యకర్తలు రాత్రి 7 గంటలకు చేతులకు తాడు లేక రిబ్బను కట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన తెలపాలని ‘న్యాయానికి ఇంకెన్నాళ్ళు సంకెళ్లు’ అంటూ నినాదాలు చేయాలని ఆయన కోరారు వైసీపీ పాలన లో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బుల్లిబాబు అన్నారు అంతే కాకుండా డి ఎస్సీ తో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని,ప్రతీ ఏటా జాబ్ కాలండర్ విడుదల చేస్తామని మరియు మద్యపాన నిషేధం అని పలు హామీలను చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచి ఆ తరువాత వాటిని తుంగలో తొక్కి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆయన అన్నారు వాటిని గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులతో నియంత లా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని వచ్చే ఎన్నికలలో వైసీపీ కి ప్రజలే బుద్ది చెబుతారని తునిలో యనమల దివ్య గెలుపు తధ్యమని కార్యకర్తలు మరింత ఉత్సాహంగా కృషి చేయాలని ఆయన కోరారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి

