అల్లిపూడి లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేఖిస్తూ తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ‘న్యాయానికి సంకెళ్ళు’ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామం లోని తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ చేతులకు తామే తాడులతోనూ,రిబ్బన్లతోనూ సంకెళ్ళు వేసుకొని అక్రమ అరెస్ట్ కు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు ‘న్యాయానికి ఇంకెన్నాళ్ళు సంకెళ్ళు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఉద్దేశిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయటం సిగ్గుచేటని అప్రజాస్వామ్యమని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారం లోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంకం రెడ్డి గోపి,చింతకాయల సురేష్, చింతకాయల కొండబాబు, పసగడుగుల అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్