కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆదేశాలతో “దేశం చేస్తుంది రావణాసుర దహనం – మనం చేద్దాం జగణాసుర దహనం” అనే కార్యక్రమంను మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు “సైకో పోవాలి సైకిల్ రావాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా అంకంరెడ్డి బుల్లి బాబు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి కక్ష పూరితమైన అక్రమ కేసులను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని వచ్చే ఎన్నికలలో ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, చింతకాయల కొండబాబు, చింతకాయల సురేష్ కుమార్, కొండ్రు కళ్యాణ్,ఎస్.సి.సెల్ కార్యదర్శి నెమ్మాది సత్యనారాయణ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


