సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం

 

 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కు హాజరైన “ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్: పలువురు సీనియర్ పాత్రికేయులు, న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ‘ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా ఉండాలని మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోకుండా ఉండి నిజమైన, నికార్సయిన నాయకులను ఎన్నుకున్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలిపారు. కావున మేధావులు, విద్యావంతులు, యువకులు, రైతులు , మహిళలు వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని భావితరాలకు బాటలు వేయాలని ఈ సభాముఖంగా ప్రజలందరికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!