బిక్కవోలు మండలంలో శని,ఆదివారాలులో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్
బిక్కవోలు : అఖండ భూమి వెబ్ న్యూస్ :
తూర్పుగోదావరిజీల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం లోని 58 పోలింగ్ స్టేషన్లు యందు నవంబర్ 4(శనివారం),మరియు నవంబర్ 5(ఆదివారం)తేదీలులో ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలు అనుసారం ఉదయం 8గంటలు నుండి సాయంత్రం 5గంటలు వరుకు బూత్ లేవల్ అధికారులు అందుబాటులో ఉంటారుని,కొత్త ఓట్లు నమోదుకు దరాఖాస్తులు , పేర్లు తదితర వివరాలు మార్పు మరీయు ఓట్లు పై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారుని అసిస్టేంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు తాహశీల్దార్ పోసిబాబు తెలియజేసారు.ప్రతి ఒక్కరూ మొన్న ప్రచురించబడిన ఓటర్ల జాబితాను పరిశీలించుకుని,జాబితాలో తమ పేరు ఉన్నది,లేనిది చూసుకుని ఏవైన అభ్యంతరాలు ఉంటే బూత్ లెవల్ ఆఫీసర్లుకు తెలియజేయవచ్చును అని అన్నారు.అలానే జనవరి 2024 కీ 18సంవత్సరాలు నిండుతున్న ప్రతి ఒక్కరూ ఈ స్పెషల్ ఓటర్ల క్యాంప్ ద్వారా నమోదు చేసుకోవాలిని కోరారు.



