ప్రైవేటు పాఠశాలలలో సామర్థ్య వ్రాత పరీక్షలు.. వెల్దుర్తి నవంబర్ 03 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే 2023 (ఎస్ ఈ ఏ ఎస్) నిర్వహణలో భాగంగా వెల్దుర్తి ప్రైవేట్ పాఠశాలల నందు విద్యార్థులతో సామర్థ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సామర్ధ్య పరీక్షలకు ఎంఈఓ ఇందిరా హాజరై పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థులతో మాట్లాడుతూ సామర్థ్య పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలల పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు విద్యార్థులకు ఏ విధంగా నిర్వహించారు. పాఠశాలల యజమానులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా స్వయంగా పర్యవేక్షణ చేసి పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు వసతులు, ఆటల పరికరాలను సక్రమంగా ఏర్పాటు చేసి వారి యొక్క వ్యాయామ ఉల్లాసాలకు సహకరించాలని సూచించారు. విద్యార్థులలో అభ్యాసన ఫలితాలను అంచనా వేసేందుకు తెలుగు ఇంగ్లీష్ గణిత శాస్త్రాలలో వారి యొక్క ప్రావీణ్యతను వెలికి తీసేందుకే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు. ఈ పాఠశాలలతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలల సైతం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..