నాతవరం మండలం డి. యర్రవరం గ్రామం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం ములగపూడి గ్రామానికి చెందిన లక్ష్మణ అర్జున (23) అనే వ్యక్తి చాలాకాలంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుక్కి దున్నటానికి వెళ్లి పని ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటం తో లక్ష్మణ అర్జున ట్రాక్టర్ కింద ఉండిపోవటం తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నాతవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


