నాతవరం మండలం డి. యర్రవరం గ్రామం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం ములగపూడి గ్రామానికి చెందిన లక్ష్మణ అర్జున (23) అనే వ్యక్తి చాలాకాలంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుక్కి దున్నటానికి వెళ్లి పని ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటం తో లక్ష్మణ అర్జున ట్రాక్టర్ కింద ఉండిపోవటం తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నాతవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
-
చెర్లో పాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు.
-
కొత్త నాయుడుపాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు
-
అయ్యన్న జన్మదిన సందర్భంగా రోడ్డు శ్రమదానం చేస్తున్నకూండ్రపు
-
ఎస్సీ వర్గీకరణ వద్దు -ఎస్సీల రిజర్వేషన్ కోటా పెంచండి – మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ చిట్టుమూరు గోవింద్ డిమాండ్
-
అల్లిపూడి లో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు