బీజేపీ,కాంగ్రెస్ లను సమాధి చేయాలి- దళిత బహుజన పార్టీ పిలుపు.

డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం గా దళిత జాతిని విభజించడానికి ఉద్దేశ పూర్వక కుట్రలకు పాల్పడి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీలు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ లను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమాధి చేయకపోతే దళిత జాతికి బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ అధినేత కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ కార్యాలయంలో  శనివారం జరిగిన మీడియా సమావేశం లో దళిత బహుజన పార్టీ అధినేత వడ్లమూరి కృష్ణస్వరూప్ మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో దళితుల విభజన అనే కుట్ర రాజకీయాలకు ఈ పార్టీ లు పాల్పడినందుకే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్టాలలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని ఆయన అన్నారు.అంతే కాకుండా బీజేపీ కుట్ర రాజకీయాలపై పంజాబ్, ఢిల్లీ రాష్టాలలో దళిత జాతి యావత్తు వ్యతిరేక పోరాటాలు చేసారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడానికి దళితులను చీల్చి సామాజికంగా, రాజకీయం గా అణచివేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారని ఆయన మండి పడ్డారు.జాతీయ స్థాయి లో నేతలు కూడా అదే తరహాలో అణచివేత కు సిద్ధం గా ఉన్నారని కృష్ణ స్వరూప్ ఆరోపించారు. ఆ పార్టీ నేతలు సృష్టించి పెంచి పోషించిన కొంతమంది రాజకీయ బ్రోకర్లు ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ అంబేద్కర్ గారి స్పృహ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధం గా ఉన్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత జాతికి ఎన్నికలు ద్వారా పొలిటికల్ పవర్ సాధన ద్వారా మాత్రమే సోషల్ జస్టిస్, రక్షణ,విముక్తి వస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ నేతల విభజన కుట్ర రాజకీయాలకు బలైతే బౌషత్ ఉండదని పూర్వపు బానిసత్వం తప్పదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో దళిత బహుజన పార్టీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవునూరి శ్రీనివాస్, ఎన్నికల కమిటీ సభ్యులు బొడుసు మహేష్ యాదవ్, పి. సాంబయ్య వడ్డెర గంధం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!