ఊలపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించిన టి ఏ అర్ ఎల్ జిల్లా కోఆర్డినేటర్
బిక్కవోలు :అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఈరోజు ఊలపల్లి లోని శ్రీ ముల్లంగి బులి వీరన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ను తూర్పుగోదావరి జిల్లా టి ఏ అర్ ఎల్ కార్యక్రమంనకు ప్రథం సంస్థ తరఫున జిల్లా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న గెళ్ళ సురేష్ నాని సందర్శించడం జరిగింది. పాఠశాలలో 3,4,5 తరగతులలో తెలుగు మరియు గణితము సబ్జెక్టులలో విద్యార్థులలో అభ్యసన స్థాయిని పెంచేందుకు రూపొందించబడిన టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమ అమలు తీరు, రిజిస్టర్ల నిర్వహణ, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల బోధనా పద్ధతి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో కార్యక్రమం మరింత ప్రభావవంతంగా నిర్వహించుటకు తెలుగు గణితము బోధిస్తున్న ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేసిరి.కార్యక్రమం లోపాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొవ్వూరి అమ్మిరెడ్డి ఉపాధ్యాయులు బి. జ్యోతి కె.బాల కుమారి పాల్గొనిరి.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



